స్త్రీల రుతుక్రమాన్ని అపవిత్రంగా భావిస్తారు ఎందుకనీ?

పీరియడ్స్ సమయంలో మమ్మల్ని మా ఇంటిలోని పూజ గదిలోకి ఒక్కసారి కూడా వెళ్ళవద్దని మా పెద్దవారు గద్దిస్తారు. బహిష్టు అనేది ఎక్కువగా బాధించే విషయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హిందూ మత సంప్రదాయాల ప్రకారం ఈ సమయంలో మహిళను అపవిత్రంగా భావిస్తారు.

సంప్రదాయాల ప్రకారం,ఒక మహిళ ఆమె బహిష్టు సమయంలో దేవాలయాలకు లేదా ఆమె ఇంటి పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఆమె ఇతర కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండాలి. ఆమె జుట్టును దువ్వెనతో దువ్వుకోకూడదు. ఊరగాయలను ముట్టుకోకూడదు. కాజల్ లేదా ఎటువంటి అలంకరణ చేసుకోకూడదు. వంటగదిలోకి వెళ్ళకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే,ఒక మహిళ బహిష్టు సమయంలో ఒక సాధారణ జీవితం గడపాలి.
వాస్తవానికి పాత కాలం రోజుల్లో,బహిష్టు సమయంలో మహిళలను ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉంచేవారు. బహిష్టు సమయంలో మహిళలు అన్ని రోజులు ఒకే వస్త్రాన్ని ఉపయోగించేవారు. ఆమె జుట్టు దువ్వకుండా చిక్కుతో ఉంటుంది. ఎవరు మాట్లాడకుండా తప్పించుకుంటారు. సాధారణ ఆహారం తింటారు. నేలపై నిద్రిస్తారు. అలాగే ఎటువంటి వస్తువులను ముట్టుకోరు. ఈ సమయంలో మహిళలు ఇంటి పని మరియు పూజ చేయటం నుంచి ఎందుకు మినహాయింపు ఉందో కారణం ఉంది.
కానీ మీరు హిందూమతం ప్రకారం బహిష్టు సమయంలో మహిళలను ఎందుకు అపవిత్రంగా భావిస్తారో కారణాల గురించి తెలుసుకోవాలి. మీరు దీనిని చదివితే కొన్ని అద్భుతమైన నిజాలను కనుగొనవచ్చు.