తన్నుడు బాబా తో తనివితీరా తన్నించుకున్న ఒక యం.పి

tannudu baaba.taninchukunna empi.
పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రత్యేక వైభవం ఉంది..ఈ పుష్కర స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుందని అందరు నమ్ముతారు.. అందుకే ఈసారి చిన్నారుల నుంచి పెద్దల వరకు కోట్లలో పుష్కర స్నానమాచరించారు. 

ఇందులో రాజకీయ నాయకులు, అధికారులు కూడా వున్నారు. ఈసారి పుష్కరాల్లో చిత్రవిచిత్రాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇదే అదును చేసుకొని కొంతమంది స్వాములు పుష్కర ఘట్ దగ్గర కనిపించరు. జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ ఫ్యామిలీతో పాటు నిజామాబాద్ జిల్లా కందకుర్తి పుష్కరఘాట్‌కు వచ్చారు. 

ఎవరో కొందరు చెప్పారని.. కేదారపీఠం, రంభపురి పీఠాధిపతులతో వారి కాళ్ళు నెత్తిన పెట్టించుకుంటే పుణ్యం కలుగుతుందని చెప్పడం తో ఇలా. నెత్తిన కాళ్లు పెట్టించుకుని మరీ ఆశీర్వాదాలు తీసుకున్నారు.